ఆపరేషన్ బ్లూ స్టార్ 40వ వార్షికోత్సవం సందర్భంగా గురువారం గోల్డెన్ టెంపుల్ ప్రాంగణంలో పలువురు సిక్కు వర్గీయులు ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేశారు. 1980లలో పంజాబ్లో ఖలిస్థాన్ అనుకూల ఉద్యమానికి నాయకత్వం వహించిన జర్నైల్ సింగ్ భింద్రన్వాలే యొక్క పోస్టర్లను కూడా నిరసనకారులు ప్రదర్శించారు. ఆయన జూన్ 1984లో సైనిక చర్యలో మరణించారు.
ఇదలా ఉండగా రద్దు చేయబడిన 17వ లోక్సభలో సంగ్రూర్ నుండి పార్లమెంటు సభ్యుడు సిమ్రంజిత్ సింగ్ మాన్ ఖలిస్తాన్ అనుకూల నినాదాలు చేస్తున్న వ్యక్తుల మధ్య కనిపించారు. అక్టోబర్ 31, 1984న, ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించాలని సైన్యాన్ని ఆదేశించిన అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ఆమె నివాసంలో ఇద్దరు సిక్కు అంగరక్షకులు బియాంత్ సింగ్, సత్వంత్ సింఖ్ హత్య చేశారు.

