మరికొద్ది నిమిషాల్లో బయలుదేరాల్సిన ఎయిర్ కెనడా విమానంలో బాంబు ఉన్నట్టు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చెందిన సోషల్ మీడియా బృందానికి మంగళవారం రాత్రి ఇమెయిల్ రావడంతో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. 301 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బందితో ఉన్న విమానం భద్రతా తనిఖీల కోసం ఖాళీ చేయబడి ఐసోలేషన్ బేకు మళ్లించబడింది.
అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదని అధికారులు తెలిపారు. అనంతరం విమానాన్ని రద్దు చేశారు. ఒక నెల వ్యవధిలో ఇలా బాంబు బెదిరింపు జరగడం ఇది నాలుగోసారి. మంగళవారం రాత్రి 10.50 గంటల ప్రాంతంలో ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ నుంచి ఈమెయిల్ గురించి పోలీసులకు సమాచారం అందిందని డీసీపీ ఉషా రంగాని తెలిపారు.
