ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల సందర్భంగా ప్రతి పోలింగ్ స్టేషన్కు సంబంధించిన ఓటర్ ఓటింగ్ డేటాను తన వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలంటూ ఎన్.జీ.వో. చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది.
ఇప్పటికే ఐదు దశల పోలింగ్ పూర్తయిందని, రెండు మాత్రమే మిగిలి ఉన్నందున ఈ దశలో అవసరమైన సిబ్బందిని ఏర్పాటు చేయడం ఎన్నికల కమిషన్కు సవాలుగా మారుతుందని జస్టిస్ దీపాంకర్ దత్తా, సతీష్ చంద్ర శర్మలతో కూడిన వెకేషన్ బెంచ్ పేర్కొంది.
గ్రౌండ్ రియాలిటీలను కూడా గుర్తుంచుకోవాలి, ఎన్నికల సమయంలో ప్రక్రియను మధ్యలో మార్చడం ద్వారా ఈ.సీ. పై అధిక భారం వేయకూడదని పేర్కొంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ను ఎన్నికల తర్వాత రెగ్యులర్ బెంచ్ విచారించాలని కోర్టు వాయిదా వేసింది.

