కాకినాడ జిల్లాలో యువకులు ఓటరు చైతన్యం చెందే దిశగా జిల్లా కలెక్టర్ జె. నివాస్ ప్రత్యేక శ్రద్ధ చూపడం వలన జిల్లా ఎస్.పి. సతీష్ కుమార్ పకడ్బందీగా చేపట్టిన శాంతి భద్రతల నిర్వహణతో పోలింగ్ శాతం పెరిగిందని పౌర సంక్షేమ సంఘం అభినందనలు తెలియజేసింది. కాకినాడ సిటీ లో 72 శాతం, రూరల్ లో 73శాతం, జిల్లాలో 75 శాతం పోలింగ్ జరగడం అత్యంత అభినందనీయమన్నారు. జె.ఎన్.టి.యు. లైబ్రరీ హాలులో ఎన్నికల ప్రత్యేక అధికారి రాజేష్ జోగ్ పాల్ జిల్లా ఎన్నికల అధికారి నివాస్ లకు పౌర కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసర్ల పూడి రమణరాజు పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలియజేసారు.
ఓటరు చైతన్య ప్రచార వాహన యాత్రకు సహకరించిన అధికారులకు ప్రజలకు ధన్యావాదాలు తెలిపారు. పౌర సంఘం చేపట్టిన కరపత్రాల పంపిణీ స్వచ్ఛంద ఓటరు చైతన్య ప్రచార వాహనయాత్ర గురించి కలెక్టర్ నివాస్ ప్రత్యేక ఎన్నికల అధికారి జోగ్ పాల్ కి వివరించి ప్రశంసించారు. రూరల్ రిటర్నింగ్ అధికారి ఆర్.డి.ఓ. ఇట్ల కిషోర్, సిటీ రిటర్నింగ్ అధికారి, కమీషనర్ జె. వెంకట రావు, నగర డి.ఎస్.పి. కె. హనుమంతరావు పకడ్బందీగా ఎన్నికల సర్వీస్ నిర్వహించారని పేర్కొన్నారు.

