ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అన్న జగన్ కి ఇదే ఆఖరి ఛాన్స్ లని విజయనగరం ప్రజాగళం సభలో టీ.డీ.పీ. జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు అన్నారు. బుధవారం రాత్రి విజయనగరంలో జరిగిన ప్రజాగళం సభలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాశనం చేసిన వై.సీ.పీ. కి వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఇంటికి సాగనంప్పబోతున్నారన్నారు. ఓటు అనే వజ్రాయుధాన్ని ఉపయోగించి సిద్ధం అంటూ ఊళ్ల మీద పడిన జగన్ ని ఓడించడానికి జనం సిద్ధమైపోయారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అరాచక, విధ్వంసక దోపిడీలకు కారణం అయిన ఈ ప్రభుత్వాన్ని భూస్థాపితం చేసే వరకు వదలమన్నారు. ప్రజలకు మంచి చేయడం జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. నాయకత్వంతోనే సాధ్యమని తెలిపారు.
విజయనగరం ప్రజాగళం సభలో పవన్ తో టీడీపీ అధినేత…

