కాకినాడ జిల్లాలోని తొండంగి మండలం గడ్డిపేటలో వైఎస్ఆర్సిపి పార్టీకి షాక్ తగిలింది. ఆ పార్టీ కి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలోకి స్వచ్చందంగా చేరారు. ఈ సందర్బంగా శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు యనమల రామకృష్ణ వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తొండంగి మండలంలో ఉమ్మడి పార్టీని గెలిపించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి యనమల దివ్య, యనమల రాజేష్, బిజెపి మండల అధ్యక్షులు వెలుగుల గోపాలకృష్ణ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
తొండంగి మండలంలో టీ.డీ.పీ. లో పలువురు చేరిక…

