హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో గురువారం జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కొందరు గ్రామస్తులు మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ధర్మేందర్ నుండి కీ లాక్కొని వాహనం ముందుకు వెళ్లకుండా ఆపారు. అయితే ధర్మేందర్ను మార్చడంపై పాఠశాల అధికారులు హామీ ఇవ్వడంతో తిరిగి తాళాలు అతనికి అందజేశారు.
ప్రస్తుతానికి డ్రైవర్కు కీలను తిరిగి ఇవ్వాలని ఈ గ్రామస్తులను అభ్యర్థించారు, కొత్త డ్రైవర్ను పంపుతామని హామీ ఇచ్చారు. అయితే, ఉదయం 8.30 గంటల ప్రాంతంలో కనినిలోని ఉన్హాని గ్రామ సమీపంలో డ్రైవర్ నియంత్రణ తప్పి చెట్టును ఢీట్టింది. దీనితో దాదాపు 40 మంది పిల్లలతో జి.ఎల్. పబ్లిక్ స్కూల్కు వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురై బోల్తా పడింది.
గ్రామస్థులే కాదు, కొంతమంది తల్లిదండ్రులు కూడా డ్రైవరు మద్యపానం అలవాటు గురించి పాఠశాల అధికారులకు సూచించినట్లు వార్తా సంస్థ పీ.టీ.ఐ. నివేదించింది. వాస్తవానికి గురువారం కూడా డ్రైవరు మద్యం మత్తులో ఉన్నట్లు పాఠశాలకు సమాచారం అందించారు. ఈ కేసులో డ్రైవర్ ధర్మేందర్తో సహా ముగ్గురిని అరెస్టు చేశారు.
