డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ వై.సీ.పీ. ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు గుప్పు మంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు తన అనుచరులతో చర్చించినట్లు సామాచారం. ఇప్పటికే ఆంధ్ర ప్రధేశ్ కాంగ్రెస్ చీఫ్ షర్మిలకు చిట్టిబాబు ఫోన్ చేసినట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి చేరిక తో తనకు ప్రాధాన్యత తగ్గుతుందని చిట్టిబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. పి. గన్నవరం స్థానానికి కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. బహుశా చిట్టిబాబు పోటీ చేసే అవకాశం ఉంటుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతుంన్నాయి.
కండువా మారనుందా… కాంగ్రెస్ లోకి కొండేటి..?

