Telangana

కే.సీ.ఆర్. పై మండిపడ్డ మంత్రి శ్రీధర్…

1200-675-20352712-thumbnail-16x9-minister--sridhar-babu-singareni-election-campaign

అసెంబ్లీ ఎన్నికల్లో బీ.ఆర్‌.ఎస్‌. ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నదని పరిశ్రమల శాఖ మంత్రి డీ. శ్రీధర్‌ బాబు గులాబీ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్‌ ప్రభుత్వంపైనా, నేతలపైనా అభ్యంతరకర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి గోదావరిఖనిలో జరిగిన ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో కాంట్రాక్టు కార్మికులు లేరని మాజీ సీ.ఎం. చెప్పారని, అయితే వారి సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.

వంశీకృష్ణ ఎన్నికైతే సెగ్మెంట్‌లో జెన్‌కో పవర్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికే యువ నాయకులు రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు. ప్రతి కార్యకర్త ఇందులో భాగమై పెద్దపల్లి నుంచి కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో కాలంగా సేవలందించిన మాజీ ఎం.పీ. జీ. వెంటక స్వామి మనవడు వంశీ. కాంగ్రెస్‌ హైకమాండ్‌ అన్ని కోణాలను పరిశీలించి ఆయనకు టిక్కెట్‌ ఇచ్చిందన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

congress-leader-revanth-reddy-addresses-a-press-755234
Telangana

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయబోతున్నా… -రేవంత్ రెడ్డి –

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ లో కాంగ్రెస్ విజయం సాదిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక సమావేశంలో తెలిపారు. నాయకులు, కార్యకర్తలు సంబరాలు
OIP (6)
Telangana

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజ…

పోస్టల్‌ బ్యాలెట్‌ ఫలితాలలో కాంగ్రెస్‌ ముందంజలో కొనసాగుతోంది. ఉద్యోగుల్లో కూడా అధికార పార్టీ బీ.ఆర్‌.ఎస్‌. పై వ్యతిరేకత కనిపిస్తుంది. ఉమ్మడి ఖమ్మం పది స్థానాల్లోనూ కాంగ్రెస్‌ ముందంజలో