అసెంబ్లీ ఎన్నికల్లో బీ.ఆర్.ఎస్. ఓటమిని జీర్ణించుకోలేక పోతున్నదని పరిశ్రమల శాఖ మంత్రి డీ. శ్రీధర్ బాబు గులాబీ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్రావు కాంగ్రెస్ ప్రభుత్వంపైనా, నేతలపైనా అభ్యంతరకర పదజాలంతో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పెద్దపల్లి లోక్సభ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణతో కలిసి గోదావరిఖనిలో జరిగిన ఎన్నికల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ లో కాంట్రాక్టు కార్మికులు లేరని మాజీ సీ.ఎం. చెప్పారని, అయితే వారి సమస్యల పరిష్కారంపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు.
వంశీకృష్ణ ఎన్నికైతే సెగ్మెంట్లో జెన్కో పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేస్తామని మంత్రి చెప్పారు. ప్రజలకు సేవ చేయడానికే యువ నాయకులు రాజకీయాల్లోకి వస్తున్నారని అన్నారు. ప్రతి కార్యకర్త ఇందులో భాగమై పెద్దపల్లి నుంచి కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు. ఈ ప్రాంత ప్రజలకు ఎంతో కాలంగా సేవలందించిన మాజీ ఎం.పీ. జీ. వెంటక స్వామి మనవడు వంశీ. కాంగ్రెస్ హైకమాండ్ అన్ని కోణాలను పరిశీలించి ఆయనకు టిక్కెట్ ఇచ్చిందన్నారు.

