Political

ముస్లిం లీగ్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీపై విరుచుకుపడ్డ కాంగ్రెస్…

OIP (19)

ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ శనివారం తీవ్రస్థాయిలో విమర్శల దాడి చేసింది. తన ప్రభుత్వం హయాంలో జరిగిన పదేళ్ల అన్యాయం మరియు సమస్యలు నుండి దేశం దృష్టిని మరల్చాలనుకుంటున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. కాంగ్రెస్ పార్టీ తన మ్యానిఫెస్టోపై ప్రధాని మోదీ నిందలు వేసిన తర్వాత కాంగ్రెస్ ప్రకటనలు వచ్చాయి. స్వాతంత్ర్యానికి పూర్వం కాలంలో పార్టీ ఆలోచనా విధానం ముస్లిం లీగ్‌ను పోలి ఉందని ఇది ప్రతిబింబిస్తుందని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ ఎప్పుడూ ప్రజల సమస్యల గురించి మాట్లాడరని, ముస్లిం లీగ్ వ్యాఖ్యలతో అసలు సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించాలని చూస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎం.పీ. జైరాం రమేష్ అన్నారు. ప్రధాని ఎప్పుడూ ప్రజల గురించి మాట్లాడరని, ప్రజా సమస్యలు, రైతుల సమస్యలు, యువత సమస్యలు, మహిళల సమస్యలు మరియు కార్మికుల సమస్యల నుండి దృష్టిని మరల్చాలనుకుంటున్నారని ఆయన అననారు. ఇది 10 సంవత్సరాల అన్యాయం యొక్క వాస్తవికత అని అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.