పేదప్రజలకు ఎన్నో సంక్షేమపధకాలు అందజేస్తున్న వైస్సార్సీపీ ప్రభుత్వానికి అండగా నిలిచి తిరిగి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ని సీఎం చెయ్యాలని రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. అంబేత్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం సరిపల్లి, గోపవరం గ్రామాలలో గురువారం ఆయన ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం నిర్వవహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ… మళ్ళీ వాలంటీర్లు ప్రతీనెలా 1 వ తేదీన మీఇంటికి తలుపు తట్టి పింఛన్ సొమ్ము అందించాలంటే జగనన్న ముఖ్యమంత్రి కావాలన్నారు.
చంద్రబాబు కోర్టులకు వెళ్లి వాలంటీర్లను పింఛన్ పంపిణి చెయ్యకుండా అవ్వా, తాతలపై రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. మహిళలు ఓటు అనే ఆయుధంతో ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి సంక్షేమ రాజ్యాన్ని గెలిపించవలసిన భాద్యత ఉందని విశ్వరూప్ తెలిపారు. ఈ కార్యక్రమం లో వైస్సార్సీపీ నేతలు చెల్లుబోయిన శ్రీనివాస రావు, గెడ్డం సంపద రావు, పందిరి శ్రీహరి, దంగేటి డోలామణి, తదితరులు పాల్గొన్నారు.

