కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక శంఖవరం మండలం కత్తిపూడిలో ట్యాంకర్ అనుకోకుండా పేలింది. దానితో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ట్యాంకర్ కు వెల్డింగు చేస్తుండగా గ్యాస్ ఒత్తిడికి ట్యాంకర్ పేలి ఇద్దరు మృతిచెందారని స్థానికులు తెలిపారు. మృతులు కత్తిపూడికి చెందిన కొచ్చర్ల ప్రభాకర్, బూరా సోమరాజుగా గుర్తించారు.
కాకినాడ జిల్లాలో ఘోర ప్రమాదం… ఇద్దరు మృతి…

