Political

నాగ్‌పూర్‌ లో జరిగిన కార్యక్రమంలో నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు…

th (9)

నాగ్‌పూర్‌లో మార్చి 23 న జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన రాజకీయ వారసత్వంపై బి.జె.పి. కార్యకర్తలకు హక్కు ఉందని నొక్కి చెప్పారు. తన కొడుకులు రాజకీయాల్లో లేరని కూడా ఆయన పంచుకున్నారు. రాజకీయాల్లోకి రావాలంటే గ్రౌండ్ లెవల్ నుండే ప్రారంభించాలని తన కుమారులకు చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ ఎన్నికల్లో 5 లక్షలకు పైగా ఓట్లతో గెలుస్తానని నితిన్ గడ్కరీ అన్నారు. మీరందరూ నన్ను ప్రేమించారు, దేశంలో నేను ఏ పని అయినా చేయగలిగాను, మీ ప్రేమ మరియు మద్దతు వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. ఏ పని చేసినా దాని క్రెడిట్ పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు చెందుతుందని అన్నారు. నా కొడుకులు ఎవరూ రాజకీయాల్లో లేరు.

రాజకీయాల్లోకి రావాలంటే ముందుగా గోడలకు పోస్టర్లు అతికించి గ్రౌండ్ లెవల్ లో పనిచేయాలని నా కొడుకులకు చెప్పానని ఆయన అన్నారు. నా రాజకీయ వారసత్వంపై బీ.జే.పీ. కార్యకర్తలకు హక్కు ఉందని, నేను నాగ్‌పూర్‌ని ఎప్పటికీ మరచిపోలేదఅన్నారు. గడచిన 10 ఏళ్లలో నాగ్‌పూర్‌లో లక్ష కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశానని ఆయన అన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.