ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో, మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ.డి. కేసులో బెయిల్ పొందినప్పటికీ సీ.బీ.ఐ. ప్రారంభించిన కేసులో కస్టడీలో ఉన్నందున కేజ్రీవాల్ జైలులోనే కొనసాగుతారు.
అరవింద్ కేజ్రీవాల్ 90 రోజులకు పైగా జైలు శిక్ష అనుభవించారు. అతను ఎన్నుకోబడిన నాయకుడు అతను పాత్రలో కొనసాగాలా వద్దా అనేది అతని ఇష్టమని జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. ఈ.డీ. అరెస్టును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను కూడా అత్యున్నత న్యాయస్థానం విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.

