నరేంద్ర మోడీ క్యాబినెట్ 3.0 యొక్క మొదటి సమావేశం సోమవారం జరిగింది. ఇందులో మోడీ నేతృత్వంలోని క్యాబినెట్లో భాగంగా ప్రమాణం చేసిన 71 మంది మంత్రులకు పోర్ట్ఫోలియోలు కేటాయించబడ్డాయి. కొత్తగా ఏర్పాటైన మంత్రివర్గం నేడు ఆయా కార్యాలయాల్లో బాధ్యతలు చేపట్టనుంది.
9.3 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే 17వ విడత పీ.ఎం. కిసాన్ నిధిని విడుదల చేయడానికి, సుమారు రూ. 20,000 కోట్లు పంపిణీ చేయడానికి అధికారం ఇచ్చే తన మొదటి ఫైల్పై సంతకం చేసిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం సౌత్ బ్లాక్లో పదవీ బాధ్యతలు స్వీకరించారు.
కొత్త కేబినెట్లో అమిత్ షా హోం మంత్రిత్వ శాఖను, రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖను కొనసాగించారు. అంతే కాకుండా రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు కూడా నితిన్ గడ్కరీ నేతృత్వం వహిస్తారు. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు వ్యవసాయ శాఖను కేటాయించగా, జేపీ నడ్డాకు ఆరోగ్య శాఖను కేటాయించారు.

