Political

60 రోజులు పాటు జరిగే చైత్ర పోరాటాన్ని విజయవంతం చేయాలి….

IMG-20231209-WA0018(1)

రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో 60 రోజుల పాటు ప్రజా చైతన్య పోరాటాన్ని నిర్వహిస్తున్నట్లు కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి ముత్తా శశిధర్ తెలిపారు. కాకినాడ నగరంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ పర్యటించి 67 ఏళ్లు అయిన సందర్భంగా ఆయన సమాధి ఉన్న ముంబైలోని చైత్ర భూమి వద్ద సముద్రంలో సేకరించిన మట్టిని కలిపామని చెప్పారు. ఈ సందర్భంగా శశిధర్ మాట్లాడుతూ…. కాకినాడ పరిసర ప్రాంతాల్లో 40 రోజులు పాటు జనసేన పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సమాధి ఉన్న ప్రదేశాలను పర్యటిస్తామన్నారు.

అక్కడ మట్టిని సేకరించి ముంబైలోని అంబేద్కర్ సమాధి ఉన్న చైత్ర భూమి దగ్గర కలపడం పట్ల జనసేన తమ విధేయతను మరోసారి ప్రదర్శించిందన్నారు. వచ్చే వంద రోజుల్లో జనసేన అధికారంలోకి వస్తుందని ఈ చైతన్య పోరాటంలో తెలుసుకున్న సమస్యలను పరిష్కరించేందుకు విశేష కృషి చేస్తుందన్నారు. అనంతరం ప్రజా చైతన్య పోరాటం గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో జనసేన కాకినాడ సిటీ ఉపాధ్యక్షుడు అడబాల సత్యనారాయణ, చోడిపల్లి సత్యవతి, బండి సుజాత, సబ్బే దీప్తి తదితరులు పాల్గొన్నారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.