Crime

5,450 కేజీల పి.డి.ఎస్‌ బియ్యం సీజ్…???

WhatsApp Image 2024-02-08 at 3.59.48 PM

కాకినాడ జిల్లాలోని జగ్గంపేట గ్రామం మండల పరిధిలో పి.డి.ఎస్‌ (రేషన్ బియ్యం) తో వెళ్ళుతున్న రెండు వాహనములను విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ మరియు సివిల్ సప్లయ్స్ అధికారులతో కలిసి తనిఖీ చేసారు. అందులో ఒక వాహనం నెం. AP39 UD 5453 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా సదరు వాహనం నందు 56 బస్తాలలో సుమారు 2800 కేజీల పి.డి.ఎస్‌ బియ్యంను గుర్తించినట్లు తెలిపారు.

పెద్దాపురం మండలం గొరుంట్ల గ్రామమునకు చెందిన శ్రీ బావిశెట్టి కనకరాజు, తండ్రి శ్రీను వారు పెద్దాపురం పరిసర ప్రాంత గ్రామ కార్డుదారుల నుండి రూ.20/-కు కొనుగోలు చేసి రూ.22/-లకు జగ్గంపేట లోని ఇటుకబట్టి కార్మికులకు అమ్ముతున్నట్లు తెలిపారు. వాటి విలువ రూ 7,27,400/- లు ఉంటుందన్నారు.

ఇంకోక వాహనం నెం. AP31 TC 9619 ను అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా, సదరు వాహనం నందు 53 బస్తాలలో సుమారు 2650 కేజీల పి.డి.ఎస్‌ బియ్యంను గుర్తించినట్లు తెలిపారు. వాటి విలువ సుమారు రూ 4,20,575/- లు ఉంటుందని వెళ్లడించారు. ఈ ఘాతగానికి పాల్పడిన వీరిపై 6-ఏ క్రింద కేసు నమోదుచేసినట్లు అధికారులు తెలిపారు. ఈ తనిఖిలలో కార్యాలయ సబ్ ఇన్స్పెక్టర్ జగన్నాధరెడ్డి, జగ్గంపేట సి.ఎస్.డి.టి కృష్ణ, కానిస్టేబుల్స్ వలీ, వీరబాబు మరియు రెవెన్యూ, సివిల్ సప్లయ్స్ అధికారులు పాల్గొన్నారు .

Avatar

Simhadri Penke

About Author

You may also like

WhatsApp Image 2023-10-12 at 5.33.17 PM
Crime

ముమ్మడివరం మండలం అంబేద్కర్ జిల్లాలో తనిఖీలు చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం..

విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం ముమ్మడివరం మండలము లోని శ్రీ తారకరామా ట్రేడర్స్ ఎరువుల షాపును తనిఖీ చేశారు. ఎరువుల నిల్వలను స్టాక్ రిజిస్టర్ ప్రకారం,
WhatsApp Image 2023-10-13 at 9.48.30 PM
Crime

ఘర్షణకు పాల్పడ్డ SKBR కాలేజీ విద్యార్థుల పై చర్యలు….

అమలాపురం పట్టణంలోని శ్రీ కోనసీమ భానోజీ రామర్స్ కాలేజీ విద్యార్థుల మద్య ఘర్షణ జరిగిందని, ఆ ఘర్షణలో రెండు కేసులు నమోదు చేయడం జరిగిందని అమలాపురం డి.యస్.పి.