రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి వర్కర్లు చేస్తున్న న్యాయ పోరాట సమ్మె 31వ రోజుకు చేరుకుంది. ఇందుకు మద్దతుగా ఆశ వర్కర్స్ యూనియన్ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి ర్యాలీగా అంగన్వాడి సమ్మె శిభిరం వరకు వచ్చి తమ మద్దతును తెలియజేసారు. ఈ సందర్భంగా అధ్యక్షులు నార్ల ఈశ్వరి, ప్రధాన కార్యదర్శులు చంద్రమల్ల పద్మ మాట్లాడుతూ… అంగన్వాడిలపై రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న వైకరి న్యాయమయినది కాదని అన్నారు.
అంగన్వాడిల పోరాటం 31 వ తేదీకి చేరుకున్నా వారి సమస్యలపై ఎటువంటీ స్పందనా లేదన్నారు. ఎన్నికలకు ముందిచ్చిన హామీలను నెరవేర్చమంటే అంగన్వాడి వర్కర్లను బెదిరించడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో సుగుణ, నవ కుమారి, మొగలి బేబీ, మలక నాగలక్ష్మి, బి వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

