శంఖవరం మండలంలోని వజ్రాకూటం గ్రామ సర్పంచ్ సకురు గుర్రాజు సంక్రంతి సందర్బంగా 25 మంది స్థానికులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు. ప్రజల మనిషిగా, ప్రజా సేవకై నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తూ గ్రామ ప్రథమ పౌరుడుగా బాధ్యతలు అందిస్తూ తోటి వ్యక్తులకు ఎంతో కొంత సహాయం చేయాలని సంకల్పంతో ఈ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాడు.
ఉందులో భాగంగా తన పంచాయతీ పరిధిలో పని చేస్తున్న సిబ్బందితోపాటు వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు, వై.సి.పి. కార్యకర్తలకు సంక్రంతి సందర్బంగా నూతన వస్త్రాలు పంపిణీ చేసాడు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సిబ్బందికీ నూతన వస్త్రాలు అందించడం సంతోషమని, గ్రామ పంచాయతీ అభివృద్ధిలో కీలకపాత్ర పోస్తున్న సిబ్బందికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.

