పంజాబ్ ముఖ్యమంత్రి మర్యమ్ నవాజ్ ప్రాంతీయ మంత్రివర్గం ఏర్పాటుకు సంబంధించి మిత్రపక్షాలు మరియు పార్టీ సభ్యులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఈ వారంలో 20 మంది సభ్యుల మంత్రివర్గాన్ని ప్రకటించే అవకాశం ఉందని పాకిస్తాన్ ఆధారిత వార్తా సంస్థ డాన్ నివేదిక తెలిపింది. నవాజ్ మరియు ఆమె పార్టీ పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్, పాకిస్తాన్ ముస్లిం లీగ్ క్వైడ్, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మరియు ఇస్తాహ్కామ్ ఈ పాకిస్తాన్ పార్టీ లతో చర్చలు జరిపి సంకేతాలు ఇచ్చారు.
ఈ పార్టీల నుంచి ఎన్నికైన వారిని మంత్రివర్గంలోకి చేర్చుకునే అవకాశం ఉంది. ప్రావిన్షియల్ క్యాబినెట్లో కేంద్ర మాజీ మంత్రులు రాణా సనావుల్లా, పర్వేజ్ రషీద్ మరియు మర్రియం ఔరంగజేబ్లు కీలక పాత్రలు పోషించనున్నారని వెళ్లడించారు. సనుఅల్లా మరియు రషీద్లు పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీలో సభ్యులు కానందున సి.ఎం. కు ప్రత్యేక సహాయకులు లేదా సలహాదారులుగా చేర్చబడతారని సమాచారం.

