కేంద్ర ప్రభుత్వ విధానాలపై భారత కమ్యునిస్ట్ పార్టీ, ఇతర పార్టీల నాయకుల సమన్వయంతో శుక్రవారం నిరసన తెలియజేశారు. కాకినాడ టౌన్ రైల్లే స్టేషన్ సమీపంలో నినాదాలు చేస్తూ రైల్వే ప్రైవేటీకరణ విరమించుకోవలంటూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకులు జి బేబి రాణి, జిల్లా నాయకులు పలివెల వీరబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు దువ్వా శేషబాబ్జి, తిరుమలశెట్టి నాగేశ్వరరావు, రాజ్కుమార్, ఐఎన్టీయూసీ నాయకులు రాజు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు నరాల శివ తదితరులు పాల్గొన్నారు.

