పదోతరగతి పరీక్షకు ముందు ముస్లిం బాలికల హిజాబ్లు తీసేయమని బలవంతం చేశారన్న ఆరోపణపై తల్లిదండ్రుల ఆగ్రహించడంతో గుజరాత్ విద్యాశాఖ ఓ ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ను పరీక్ష నిర్వాహకురాలిగా తొలగించింది. గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ జి.ఎస్.హెచ్.ఎస్.ఇ.బి. బుధవారం గణిత శాస్త్ర పేపర్కు ముందు భరూచ్ జిల్లాలోని అంక్లేశ్వర్ పట్టణంలోని లయన్స్ స్కూల్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
జిల్లా విద్యాశాఖాధికారి స్వాతిరావు, సంబంధిత తల్లిదండ్రులతో సమావేశమై, సీ.సీ. టీ.వీ. ఫుటేజీని పరిశీలించిన తర్వాత పరీక్షా కేంద్ర నిర్వాహకునిగా ఇలాబెన్ సురతియాను తొలగించాలని ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ… నేను సి.సి. టి.వి. ఫుటేజీని చూశానని అన్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో దరఖాస్తును నాకు అందించారన్నారు. నేను ఈ సంఘటనపై విచారణకు ఆదేశించానని ఫిర్యాదులో మెరిట్ ఉన్నట్లు గుర్తించినందున పరీక్షా కేంద్రం నిర్వాహకుడిని మార్చే ప్రక్రియను కూడా ప్రారంభించానని చెప్పారు.

