హాసన్ ఎం.పీ. ప్రజ్వల్ రేవణ్ణ ప్రమేయం ఉన్న లైంగిక కుంభకోణం వెలుగులోకి రావడంతో జూన్ 3న జరగనున్న కర్ణాటక శాసనమండలికి జరిగే ద్వైవార్షిక ఎన్నికల కోసం బీ.జే.పీ.-జే.డీ.ఎస్. కూటమిపై ఈ అంశం ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికలను రెండు పార్టీలు కలిసి ఎదుర్కొంటున్నాయి. మండలి, జెడ్పీ/టీ.పీ., బృహత్ బెంగళూరు మహానగర పాలికే బీ.బీ.ఎం.పీ. ఎన్నికలకు పొత్తు కొనసాగుతుందని జే.డీ.ఎస్., బీ.జే.పీ. ప్రకటించినప్పటికీ.. సెక్స్ స్కాండల్ ప్రాంతీయ పార్టీతో పొత్తుపై పునరాలోచనలో పడేలా చేసింది.
మూలాల ప్రకారం… ఈ సమస్య నిరంతరం మీడియా దృష్టిలో ఉంది. ప్రజల అభిప్రాయం కూడా ప్రజ్వల్కు వ్యతిరేకంగా ఉందని తెలుస్తుంది. పొత్తుపై పునరాలోచన చేయాలని కొందరు బీ.జే.పీ. నేతలు కోరుతున్నారని ఒక మూలాధారం తెలిపింది. కూటమిలో అంతా బాగానే ఉందని బీ.జే.పీ. అగ్రనాయకత్వం చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో కూడా ఇది చోటు చేసుకుంది.

