తెలగాణా రాష్ట్రం హైదరాబాదులో ప్రొఫెషనల్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటుచేశారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా నాపంల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో పనిచేసే గిగ్ వర్కర్లతో సీ.ఎం. రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఎన్నికల ముందు గిగ్ అండ్ ప్లాట్ ఫార్మ్ వర్కర్లకు రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ మేరకు వారితో ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు.
ఇందులో భాగంగా వారి సమస్యలపై సీ.ఎం. రేవంత్ రెడ్డి చర్చించారు. మహిళలకు ఆర్.టీ.సీ. బస్సులో ఉచ్చిత ప్రయాణాన్ని కల్పించడంతో గిగ్ వర్కర్లు ఉపాధిని కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని సీ.ఎం. కి వివరించారు. ఈ సమావేశానికి స్విగ్గి, జొమాటో, ఆటో డ్రైవర్లు, గిగ్ ప్లాట్ ఫార్మ్ కిందకు వచ్చే ఓలా, తదితర వర్కర్లు పాల్గొన్నారు

