Viral

సీఎం అరవింద్ కేజ్రీవాల్ షాక్ ఇచ్చిన ఢిల్లీ హైయ్ కోర్ట్…

123961-ouppsqfahq-1563284668

ఇప్పుడు రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగిస్తూ అడిల్లీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా కోర్టు అతన్ని ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపిన కొన్ని గంటల తర్వాత ఏప్రిల్ 1వ తేదీ మధ్యాహ్నం ఆయనను తీహార్ జైలుకు తరలించారు. ఈ కేసులో సహ నిందితురాలయిన బీ.ఆర్.ఎస్. నాయకురాలు కె. కవిత కస్టడీని కూడా ఏప్రిల్ 23 వరకు పొడిగించారు.

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మార్చి 21న కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈ.డీ. అతను పూర్తిగా సహకరించలేదని, తప్పుదోవ పట్టించే సమాధానాలు చెప్పాడని మరియు చాలా విషయాలను దాచిపెట్టాడని ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా యొక్క రూస్ అవెన్యూ కోర్టుకు గతంలో చెప్పారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో మార్పుల తర్వాత వచ్చిన కిక్‌బ్యాక్‌లను గోవా అసెంబ్లీ ఎన్నికల కోసం ఏ.ఏ.పీ. ప్రచారానికి నిధులు సమకూర్చడానికి ఉపయోగించారని ఈ.డీ. తన మునుపటి రిమాండ్ దరఖాస్తులో ఆరోపించింది. ఆరోపించిన కుంభకోణంలో కేజ్రీవాల్‌ను కింగ్‌పిన్, కీలక కుట్రదారు అని ఏజెన్సీ పేర్కొంది.

Avatar

Simhadri Penke

About Author

You may also like

IMG-20231028-WA0016
Viral

సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా…!

  సోషల్ మీడియా దుర్వినియోగమవుతుందా… అంటే చాలా మంది పోలీసులు అవుననే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పోలీస్‌ సంస్మరణ వారోత్యవాలలో భాగంగా కాకినాడ జిల్లా పోలీసు
News Entertainment & Arts Viral Trending News Political

తెలుగుదేశం పార్టీ టికెట్‌పై పోటీకి సిద్దం

వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు సినిమా హీరో రాజ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు.