గత పది ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఏ ఒక్క మంచి పని చేయలేదని సి.పి.ఐ. రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ అన్నారు. ప్రాజెక్టులు పరిశ్రమలు నెలకొల్పలేదని చివరికి పోలవరం ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని ఈ క్రమంలో ఓడిపోతున్నామని తెలిసి నరేంద్ర మోడీ మతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని ప్రధాని స్థాయిని దిగజార్చుతున్నారని విమర్శించారు
శనివారం ఉదయం స్థానిక సి.పి.ఐ. కార్యాలయంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో ప్రజలను మభ్యపెట్టడానికి పచ్చి అబద్దాలు ఆడుతున్నారన్నారు. కులాన్ని, మతాన్ని ఉపయోగించి ఓట్లు పొందాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. ఇండియా కూటమి అధికారoలోకి వస్తే ఎస్సీ, ఎస్టీ, బీ.సీ. రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తారని చెప్పడం దారుణం అన్నారు.

