ఏ.పీ. లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్య భారతీయ జనతా పార్టీ ” పల్లెకు పోదాం” పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. బీ.జే.పీ. జాతీయ అధ్యక్షులు జగత్ ప్రకాష్ నడ్డా, రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పిలుపు మేరకు బీ.జే.పీ. జిల్లా అధ్యక్షుడు చిలుకూరు రామకుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లాలోని 385 గ్రామపంచాయతీలు 412 గ్రామాలు 21 మండలాల పరిధిలో ఈ కార్యక్రమం నిర్వహణ గురించి విస్తృతంగా చర్చించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న మాజీ శాసనసభ్యుడు అయ్యాజీ వేమ ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఫిబ్రవరి 4 నుంచి 11వ తేదీల మధ్య ఈ కార్యక్రమం జరగవలసి ఉందిని అయితే ప్రతి జిల్లా ఈ తేదీల మధ్య మూడు రోజులు పాటు ఈ కార్యక్రమం నిర్వహించే విధంగా తేదీలు నిర్ణయించుకోవచ్చన్నారు. ఇందులో భాగంగా కాకినాడ జిల్లా లో ఫిబ్రవరి 7, 8, 9 తేదీలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు.

