సారాయి కేసులో ఒక ముద్దాయి నుండి రూ. 25వేలు జరిమానా వసూలు చేసి ప్రభుత్వంనకు జమచేసినట్లు ఎక్సైజ్ కాకినాడ నార్త్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కె రామమోహనరావు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి చెందిన నాటు సారాయి వ్యాపారి నురుకుర్తి వెంకటలక్ష్మి అనేకమార్లు సారాయితో పట్టుబడగా, ఆమెను ఈ ఏడాది జూన్ 6వ తేదీన సామర్లకోట మండల తహసిల్దార్ ఎదుట బైండోవర్ చేయగా, ఆమె తన వ్యాపారం మానకుండా సెప్టెంబర్ 5న తిరిగి పట్టుబడటంతో తహసిల్దార్ ఆదేశాలతో ఆమె నుండి రూ.25 వేలు వసూలు చేసి ప్రభుత్వంనకు జమచేసినట్లు ఆయన చెప్పారు.
సారాయి కేసులో ముద్దాయికి రూ.25 వేలు జరిమానా…
