తూర్పు గోదావరి జిల్లాలో విద్యాశాఖ కార్యాలయం ఎదురుగా సమగ్ర శిక్ష కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జే.ఏ.సీ. ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టి నిరసన 3వ రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… వారిని ద్యాశాఖలోకి విలీనం చేసి, రెగ్యులర్ చేయాలని, హెచ్.ఆర్.పాలసీ అమలు చేయాలని అన్నారు. పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్న వారికి పార్ట్ టైం విధానాన్ని రద్దుచేసి ఫుల్ టైం కాంట్రాక్టు విధానాన్ని అమలు చేయాలని డిమెండ్ చేసారు. ఈ కార్యక్రమంలో యు.టి.ఎఫ్. నాయకులు అరుణకుమారి, రాజేశ్వరి, ఎం. విజయగౌరి, టి. వి. రమేష్, సమగ్రశిక్ష ఉద్యోగులు జగదీష్, తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు హెచ్.ఆర్. అమలు చేయాలి…

