శ్రీనగర్ లోయలో రెండు రోజుల పర్యటనలో ఉన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా గురువారం సాయంత్రం శ్రీనగర్లో ఉన్న వివిధ సంఘాల సభ్యులను, బీ.జే.పీ. నాయకుల బృందాన్ని కలిశారు. జమ్మూ కాశ్మీర్లోని అన్ని స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని, అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించాలని షా బీ.జే.పీ. నాయకులను కోరినట్లు వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది సెప్టెంబర్లోగా యూటీలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.
శ్రీనగర్కు వచ్చిన వెంటనే గుజ్జర్లు, బకర్వాల్లు, పహారీలు, సిక్కులతో సహా వివిధ వర్గాలకు చెందిన అనేక మంది ప్రతినిధులను కలిశారు. ప్రతినిధులతో భేటీ అనంతరం శ్రీనగర్లోని ఓ హోటల్లో బీ.జే.పీ. నేతలతో షా సమావేశమయ్యారు. జమ్మూ కాశ్మీర్లో రాజవంశ పాలనను అంతం చేయాల్సిన అవసరాన్ని షా నొక్కిచెప్పారని పార్టీ కార్యకర్తల తెలిపారు. నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ మరియు కాంగ్రెస్లకు వ్యతిరేకంగా అత్యధికంగా ప్రజలు ఓటు వేయాలని తన పార్టీ కార్యకర్తలను కోరారు.

