సామర్లకోట 8వ వార్డు కౌన్సిలర్ పిల్లాడి సత్యవతి వై.సీ.పీ. నుంచి రెండు దఫాలుగా కౌన్సిలర్ గా పోటీ చేసిన పాలచర్ల కళ్యాణ్ కుమార్ లు శుక్రవారం సాయంత్రం తెదేపా లో చేరారు. తెదేపా కార్యాలయంలో సామర్లకోట పట్టణ అధ్యక్షులు అడబాల కుమార స్వామి, కౌన్సిలర్ బలుసు వాసుల ఆధ్వర్యంలో వీరిని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పార్టీ కండువాలు వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ప్రస్తుతం వై.సీ.పీ. కౌన్సిలర్ గా కొనసాగుతున్న సత్యవతి గత ఎన్నికల ముందు తెదేపా నుంచి వై.సీ.పీ. లో చేరి తదుపరి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి కౌన్సిలర్ గా ఎన్నికయ్యారు. అలాగే కళ్యాణ్ కుమార్ గతంలో రెండుసార్లు వై.సీ.పీ. కౌన్సిలర్ అభ్యర్దిగా పోటీచేసి పరాజయం పొందారు. ఈ కార్యక్రమంలో నాయకులు బడుగు శ్రీకాంత్, నియోజక వర్గ పరిధిలోని పలువురు తెదేపా నాయకులు పాల్గొన్నారు.
వై.సీ.పీ. కౌన్సిలర్ పిల్లాడి తెదేపా లో చేరిక…

