అంబెడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర రవాణాశాఖమంత్రి పినిపే విశ్వరూప్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం భట్నవిల్లిలోని తన స్వగృహం నుండి పార్టీ శ్రేణులు చేపట్టిన భారీ ర్యాలీ నడుమ కుటుంబ సభ్యులతో అమలాపురం ఆర్డీవో కార్యాలయం వద్దకు చేరుకున్న 12 గంటల 8 నిముషాలకు 2 సెట్ల నామినేషన్ పత్రాలను ఆర్.ఓ. కు సమర్పించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… తనకోసం ఎండను సైతం లెక్కచేయకుండా తరలివచ్చిన వేలాది మంది అభిమానులకు, కార్యకర్తలకు, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. గత 25 రోజులుగా నియోజకవర్గంలో గడపగడపకు కార్యక్రమంలో పాల్గొంటున్నాన ని జగన్ పాలన పట్ల ప్రజల్లో అద్భుతమైన స్పందన కనిపిస్తుందని అన్నారు. అమలాపురం సీటు వై.సీ.పీ. ఖాతాలోకి రానుందని అమలాపురంలో తాను మూడోసారి విజయం సాధించబోతున్నానని విశ్వరూప్ పేర్కొన్నారు

