ఆంధ్ర ప్రదేశం రాష్ట్రంలో జరగబోయే ఎన్నకలకు వైజాగ్ నుంచి తను, వరంగల్ నుంచి తెలుగు సినీ నటుడు బాబు మోహన్ పోటీ చేస్తున్నట్లు ప్రజా శాంతి పార్టీ అధినేత కే.ఏ. పాల్ వెళ్లడించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ఏ.పీ. లో ఎవరితోనూ పొత్తు లేకుండా అన్ని స్థానాలలో పోటీ చేస్తున్నామని తెలిపారు. వైజాగ్ పార్లమెంట్ స్థానం నుంచి నేను, వరంగల్ నుంచి బాబు మోహన్ పోటీ చేయనున్నం అని వెల్లడించారు. అయితే తెలంగాణలో మాత్రం ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకోడానికి సిద్ధంగా ఉన్నామని కే.ఏ. పాల్ వెల్లడించారు.
వైజాగ్ నుంచి పోటీ చేయనున్న కే.ఎ. పాల్…

