జమ్మూకశ్మీర్ భద్రతా పరిస్థితులపై ఆదివారం జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించిన హోంమంత్రి అమిత్షా మాట్లాడుతూ.. వినూత్న మార్గాల ద్వారా ఉగ్రవాదులను అణిచివేసేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. జమ్మూ డివిజన్లో ఏరియా డామినేషన్ ప్లాన్, జీరో టెర్రర్ ప్లాన్ ద్వారా కాశ్మీర్లో సాధించిన విజయాలను పునరావృతం చేయాలని షా ఏజెన్సీలను ఆదేశించారు. వినూత్న మార్గాల ద్వారా ఉగ్రవాదులను అణిచివేసి ఆదర్శంగా నిలిచేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం కట్టుబడి ఉందని షా నొక్కిచెప్పారు. మిషన్ మోడ్లో పని చేయాలని మరియు సమన్వయ పద్ధతిలో త్వరిత ప్రతిస్పందనను నిర్ధారించాలని షా అన్ని భద్రతా ఏజెన్సీలను ఆదేశించారు.
వినూత్న మార్గాల ద్వారా ఉగ్రవాదులను అణిచివేస్తాం… -అమిత్ షా-

