తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సుబ్రహ్మణ్యం మైదానంలో వాలంటీర్లకు వందనం అనే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎం.పీ. భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. తొలత వాలంటీర్లకు షాలువా కప్పి, ప్రసంసా పత్రాలను అందచేసి వారిని ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాలంటీర్లు ఇంటింటికీ వెళ్లి వారికి చేస్తున్న సేవలు మరువలేనిదని అన్నారు. ప్రతీ ఇంటికీ వెళ్లి అసలయిన లబ్ధి దారులను గుర్తించి వారికి పథకాలు అందించడంలో, పెంన్సన్ పంపిణీ చేయడంలో, రేషన్ పంపిణీలో, తదితర సేవల్లో ముఖ్య పాత్ర వహిస్తున్నారని వారిని కినియాడారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ. భరత్, గూడూరి శ్రీనివాస్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.
వాలంటీర్లను సత్కరించిన ఎం.పీ. భరత్…

