పా. రంజిత్ తాజా చిత్రం ‘తంగళన్’ విడుదల వాయిదా పడింది. హియాన్ విక్రమ్ యొక్క ‘తంగళన్’ 2024లో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటి. అయితే ఈ చిత్రం జనవరి 26, 2024న విడుదల కావాల్సి ఉంది. కాని కొన్ని అనుకోను కారణాల వల్ల విడుదల వాయిదా పడిందని తెలిపారు. పొంగల్ సందర్భంగా కొత్త పోస్టర్తో పాటు సినిమా విడుదల షెడ్యూల్ను కూడా మేకర్స్ పంచుకున్నారు.
ఈ మూవీ ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుందని తెలిపారు. విక్రమ్ నటించిన ఈ చిత్రం బంగారు తవ్వకం చుట్టూ తిరుగుతుందని తెలిపారు. భారతదేశంలో బ్రిటీష్ పాలనలో ఉన్న కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నుండి జరిగిన నిజమైన కథ ఆధారంగా రూపొందించినట్లుగా తెలిపారు.
