గద్వాల జిల్లా పైపాడులో వివాదం చోటుచేసుకుంది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ నంబరు 167లో ఉన్న ఈ.వీ.ఎం. లో కారు గుర్తు కనిపించకుండా నీలం మార్కర్ తో రుద్దడంతో ఈ వివాదం చెలరేగింది. ఈ బూత్లో మొత్తం 1,196 ఓట్లు ఉండగా 848 ఓట్లు పోలైన తర్వాత వచ్చిన ఓటరు దీనిని గమనించి అధికారులకు తెలియ జేశారు. భారాస నాయకులు, కార్యకర్తలు పోలింగ్ బూత్ వద్దకు వచ్చి సిబ్బందితో మాట్లాడి ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ స్టేషన్ లో వివాదం…
