కాకినాడ జిల్లాలో పెద్దాపురం పట్టణంలోని వై.సీ.పీ. నుంచి పలువు స్వచ్చందంగా తెలుగుదేశం పార్టీలోకి చేరారు. ఈ సందర్బంగా పెద్దాపురం ఎం.ఎల్.ఏ. నిమ్మకాయల చిన్నరాజప్ప వారికి పార్టీ కండువా వేసి సాదరంగా అహ్వానించాలి. ఎం.ఎల్.ఏ. మాట్లాడుతూ… జరగబోయే ఎన్నికల్లో ఫ్యాన్ రెక్కలను వంచడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఎవరి పాలనలో అరాచకాలు, అక్రమాలు, భూ కబ్జాలు, విధ్వంశం జరుగుతున్నాయో ప్రజలు చూస్తున్నారన్నారు. ఎవరి పాలనలో అభివృద్ధి జరిగిందో కూడా ప్రజలకు బాగా తెలుసని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన టీ.డీ.పీ. కలిసి విజయ పతాకాన్ని ఎగరువేస్తారని అన్నారు.
వచ్చే ఎన్నికల్లో జనసేన టీ.డీ.పీ. దే విజయం… -ఎం.ఎల్.ఏ. నిమ్మకాయల చిన్నరాజప్ప-

