కేంద్ర రాష్ట్ర పాలకులు దేశంలో దళిత బడుగు బలహీన వర్గాల వ్యతిరేక విధానాలు చేస్తున్నారని ఇటువంటి నేపథ్యంలో పేద ప్రజల కోసం పోరాడే కమ్యూనిస్టులు దళిత జాతి కోసం పోరాడే దళిత సంఘాలు లాల్ నీల్ ఏకమై పోరాడినప్పుడే దళిత హక్కులు పరిరక్షించబడతాయని ప్రముఖ న్యాయవాది బార్ మెంబర్ ముప్పాల సుబ్బారావు పిలుపునిచ్చారు.
మంగళవారం ఉదయం రాజమండ్రి కోర్టు ఆవరణలో దళిత హక్కుల పోరాట సమితి డి.హెచ్.పి.ఎస్. రాష్ట్ర డైరీను సుబ్బారావుతో పాటు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు జి.వి.వి.బి. రాజు, కార్యదర్శి ప్రధాన కార్యదర్శి కవి హనుమంత రావు, న్యాయవాదులు శాఖ సురేష్, తదితరులు కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సామాజిక వివక్షలు రూపుమాపేందుకు సాగుతున్న ఉద్యమాలకు ఉద్యమ కరదీపిక గా ఈ డైరీ ఉపయోగపడుతుందన్నారు. వివిధ రకాల చట్టాలు, పరిపాలన విధానాలతో ఈ డైరీ రూపొందించబడిందన్నారు. దళిత ఉద్యమకారులకు ఎంతో ఉపయోగంగా ఉపయొక్తం గా ఉంటుందన్నారు.

