ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి పీ.ఏ. నిరంజన్ తన చేతి వాటం చూపించారు. వనపర్తి జిల్లాలో లక్ష బస్తాల సీ.ఎం.ఆర్. ధాన్యం కుంభకోణానికి పాల్పడ్డాడు. సీ.ఎం.ఆర్. ధాన్యం తీసుకున్న రైస్ మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి అప్పగించకుండా లక్ష ధాన్యం బస్తాల పైగా దాచారు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా మంత్రి అనుచరులు పెద్ద కొత్తపల్లి మండలం పెద్ద కార్పాముల గ్రామానికి చెందిన కొంతమంది హమాలీల సాయంతో ఆ ధాన్యాన్ని దొంగిలిస్తూ పట్టుబడి అక్కడి నుంచి పరారయ్యారు. 300 బస్తాలు నింపిన డీ.సీ.ఎం., ఓ బొలెరో వాహనాన్ని పట్టుకొని చిన్నంబావి పోలీస్స్టేషన్కు తరలించారు.
లక్ష బస్తాల ప్రభుత్వ వడ్ల కుంభకోణం…
