చెన్నై రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా కోవిడ్ -19 కేసులు 10 కంటే తక్కువ కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు పెరగండంతో రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న రోగులు, గర్భిణీ స్త్రీలు బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్లు ధరించమని సూచించాలని డైరెక్టరేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఆరోగ్య సేవల డిప్యూటీ డైరెక్టర్లను ఆదేశించింది. అన్ని రోగలక్షణ కేసులను పరీక్షించాలని తెలిపింది. రాష్ట్రంలో కోవిడ్-19కి పాజిటివ్ పరీక్షలు చేయగా వారిలో చెన్నై, చెంగల్పట్టు కు చెందిన 5మందికి పాజిటివ్ గా నిర్ధారించారు. తరచుగా చేతులు కడుక్కోవడం, ఫేస్ మాస్క్లు ధరించడం మరియు రద్దీగా ఉండే ప్రదేశాలను నివారించడం పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని డి.పి.హెచ్. తెలిపింది.
రోగలక్షణ వ్యక్తులందరినీ పరీక్షించాలి…
