దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఏ రాష్ట్రంలో కూడా వై.సీ.పీ. ప్రభుత్వం లాంటి ప్రభుత్వాన్ని చూడలేదని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు అన్నారు. ప్రజా ధనంతో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు తాతలు, తండ్రులు, తన పేర్లు పెట్టుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. వచ్చేది జనసిన-టీ.డీ.పీ. ప్రభుత్వమేనని, ప్రజా ప్రభుత్వంలో ప్రజల కోసం జీవితాలను త్యాగం చేసిన మహానీయుల పేర్లను సంక్షేమ పథకాలకు పెడతామని హామీ ఇచ్చారు. అవినీతితో కుళ్లిపోయిన వైసీపీ సర్కార్ ను గద్దె దించి… రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు.
రాష్ట్రాన్ని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది… -పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు-

