విజయ దశమి పర్వదినం రోజున యావద్దేశం రావణాశుర దహణం చేస్తుంటారు, అయితే ఆంధ్రప్రదేశ్లో జగనాసుర దహణం జరుపుకోవాల్సి వస్తోందని కాకినాడ నగర మాజీ మేయర్, కాకినాడ జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని వ్యాక్యానించారు. తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసీ 45రోజులుగా జైలులో నిర్బందించినందుకు నిరసనగా సోమవారం అసుర దహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, చల్ల పార్వతీ, పాలిక సత్య, నక్క జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
రావణాసుర దహనం కాదిది… రాష్ట్రంలో జగనాసుర దహనం – టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు సుంకర పావని పిలుపు

