రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తుందని వలసలు ఎక్కువవుతున్నాయని ఉపాధి లేక కాకినాడ సెజ్ ప్రాంతాల్లో వలసలు పెరిగాయని వీటిని వెంటనే అరికట్టాలంటే గ్రామీణ ఉపాధి హామీ పనులను తక్షణం ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితుల నుండి వ్యవసాయ కూలీలు పేద రైతులు కుటుంబాలను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సమితి అన్ని గ్రామ సచివాలయం ముందు ధర్నాలు చేయాలని పిలుపులో భాగంగా కాకినాడ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పిఠాపురం ఉప్పాడ, కొత్తపల్లి, కాకినాడ రూరల్, సామర్లకోట ప్రాంతాల్లో ఆయా సచివాలయాలల్లో అధికారులకు ఆందోళన వినతి పత్రాలు అందజేయడం జరిగింది. యు కొత్తపల్లి మండలంలో జరిగిన ధర్నాకు రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాదులు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ… ఉపాధి హామీ లో 200 రోజులు పని దినాలు రోజు వేతనం 600 రూపాయలు తక్షణం ఇవ్వాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కేశవరపు అప్పలరాజు సునీత శ్రీను శంకర్రావు శేషయ్య తదితరులు పాల్గొన్నారు
రాయల్ కాపునాడు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా అడపా సోమేశ్వరావు…
