Political

రాయల్ కాపునాడు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా అడపా సోమేశ్వరావు…

1000040853

 రాయల్ కాపునాడు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షునిగా అడపా సోమేశ్వరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాయల్ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు గంగల వీరాంజనేయులు ఆదేశాలతో రాష్ట్ర యూత్ అధ్యక్షుడు కావలి కృష్ణ తేజ అడపాకు నియామక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా ఆ నియామక లేఖలో వీరాంజనేయులు, కృష్ణతేజలు ప్రస్తావిస్తూ… సోమేశ్వరరావు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో ఆయన్ని గుర్తించామని అందువల్ల కాకినాడ పార్లమెంట్ అధ్యక్షునిగా నియమించినట్లు చెప్పారు. తెలగ, బలిజ, కాపు సామాజిక వర్గీయులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను అడపా పరిష్కరించేలా పనిచేయాలని వీరాంజనేయులు, కృష్ణ తేజలు సూచించారు.

  ఈ సందర్భంగా అడపా సోమేశ్వరరావు మాట్లాడుతూ… తన మీద ఉంచిన నమ్మకంతో పనిచేసే ఆ పదవికి వన్నెతెస్తానన్నారు. తమ కాకినాడ పార్లమెంటు పరిధిలోని ఆయా అసెంబ్లీ నియోజకవర్గాలలో యువజన, మహిళా కమిటీలను నియమించి కాపు సామాజిక వర్గీయులను బలోపేతం చేస్తానని చెప్పారు. ప్రస్తుతం కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన వారికి కులధ్రువీకరణ పత్రాలు ఇవ్వడంలో సమస్యలు ఎదరవుతున్నాయని వాటిని అధిగమించి ఆ పత్రాలు వారికి చేరేలా తన వంతు సహకరిస్తానని అడపా సోమేశ్వర రావు తెలిపారు.

Avatar

Simhadri Penke

About Author

You may also like

electrical
Political

నూతన ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం..

ఈ ఏడాది విజయ దశమి సంధర్బంగా వెయ్యి ఎలక్ట్రికల్ బస్సు లు కొనుగోలుకు సిద్ధం చేస్తున్నామని ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆర్టీసీ ఎండి ద్వారకా
R
Political

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా తెలంగాణ..

దత్తపుత్రుడి శాశ్వత చిరునామా హైదరాబాద్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మెహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్షలు చేసారు.