మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా పిప్లోడిలో ఆదివారం రాత్రి ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులతో సహా 13 మంది మృతి చెందారు. అంతేకాకుండా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులు రాజస్థాన్లోని మోతీపురా గ్రామం నుంచి రాజ్గఢ్లోని కులంపూర్కు వెళ్తున్న వివాహ వేడుకలో పాల్గొన్నారు.
గాయపడిన వారిలో 13 మందిని జిల్లా ఆసుపత్రిలో చేర్పించామని, తలకు, ఛాతీకి తీవ్ర గాయాలైన ఇద్దరిని అధునాతన చికిత్స కోసం భోపాల్లోని హమీడియా ఆసుపత్రికి తరలించామని రాజ్గఢ్ కలెక్టర్ హర్ష్ దీక్షిత్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయం నుంచి బయటపడినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని తెలిపారు.

