అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగి గ్రామంలో ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక పరిసత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎం.పీ.డీ.ఓ.యాదగిరిశ్వర రావు విచ్చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రతీష్టత్మకంగా ప్రారంభించిన ఆడుదాం ఆంధ్ర ఆటల పోటీలలో యువత, గ్రామస్తులు, సచివాలయం అధికారులు పాల్గొవాలని సూచించారు. పాల్గొని ఈ పోటీల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
రాజవొమ్మంగిలో ఆడుదాం ఆంధ్ర పోటీలు ప్రారంభం…

