కాకినాడ జిల్లాలోని రాజపుడి లో వై.ఎస్.ఆర్.సీ.పీ పార్టీ కి భారీ షాక్ తగిలింది. ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి, వారి సోదరులు బాబురావు, ఉప సర్పంచ్, పితాని నూక రత్నం, వార్డు మెంబర్ కర్నాటి వీరబాబు, తదితరులు దాదాపుగా 100 కుటుంబాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని విడిచి జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు.
ఈ సందర్బంగా ఆయన వారికి పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారత జనతా ఉమ్మడి పార్టీ ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్వసిద్ధి రవణ, గనిరెడ్డి సత్తిబాబు, గజ్జల సాయి, భూసాల కొండబాబు, రాజపూడి సర్పంచ్ ,ఉప సర్పంచ్, తదితరులు పాల్గొన్నారు.

