రాజనగరం మండలం రూపనగర్లో గడపగడప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన ఇంటింటికీ వెళ్లి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న రాష్ట్ర అభివృద్ధి పై, ప్రజలకు అందిస్తున్న నవరత్నాల పై ప్రజల్లో అవగాహన కల్పించారు. గ్రామస్తులు విద్యుత్ సమస్యలను తెలుసుకొని వెంటనే సంబందిత అధికారులతో మాట్లాడి ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎం.ఎల్.ఏ. జక్కంపూడి, వై.సీ.పీ. కార్యకర్తలు, సచివాలయం అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
రాజనగరం గడపగడప కార్యక్రమంలో ఎం.ఎల్.ఏ….

