రంగారెడ్డి జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆమనగల్లు మండలంలో రామంతల గడ్డ సమీపంలో గల శ్రీశైలం టూ హైదరాబాద్ కు వెళ్లే జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, కారు ఎదురెదురుగా ఒకే సమయంలో రావడంతో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని వారిని ఆసుపత్రికి తరలించారు. మృతులు హైదరాబాద్ కు చెందిన వారుగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం… 3రు మృతి…

